ఉత్కంఠ పోరులో పాకిస్తాన్ జట్టుపై యువ భారత్ విజయం

ACC పురుషుల T20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024 ఒమన్ వేదికగా జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ రోజు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది.

Update: 2024-10-19 17:28 GMT

దిశ, వెబ్ డెస్క్: ACC పురుషుల T20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024 ఒమన్ వేదికగా జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ రోజు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది.  Al Amerat వేదికగా జరిగిన ఈ మ్యాచులో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో.. అభిషేక్ శర్మ 35, ప్రభ సిమ్రన్ 36, తిలక్ వర్మ 44, నెహల్ వదేరా 25, రమన్‌దీప్ సింగ్ 17 పరుగులతో రాణించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 8 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. అనంతరం 184 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన పాకిస్థాన్ జట్టు వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం కోలుకోని నెమ్మదిగా బ్యాటింగ్ చేసింది. పాక్ బ్యాటర్లలో యాసిర్ ఖాన్ 33, కుసిమ్ అక్రమ్ 27, అరాహత్ మిన్హాస్ 41, అబ్దుల్ సమద్ 25 , అబ్బాస్ అఫ్రీద్ 19 పరుగులు చేశారు. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగింది. నిర్ణీత 20 ఓవర్లలో పాకి 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు మాత్రమే చేసింది. దీంతో భారత్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది.


Similar News