టీమిండియా క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం

టీమిండియా క్రీడాభిమానుల 17 ఏళ్ల కల నెరవేరింది. వెస్టిండీస్‌లోని బ్రిడ్జ్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిపిన టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్లో టీమిండియా ఘన విజయం సాధించింది.

Update: 2024-06-29 18:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా క్రీడాభిమానుల 17 ఏళ్ల కల నెరవేరింది. వెస్టిండీస్‌లోని బ్రిడ్జ్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిపిన టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్లో టీమిండియా ఘన విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్‌లో ఏడు పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఫైనల్‌లో మ్యాచ్ గెలిచిన అనంతరం విరాట్ మాట్లాడుతూ.. ‘ఇదే నా చివరి వరల్డ్ అండ్ ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్. కొత్త ప్లేయర్లకు అవకాశం కల్పించాలనే తాను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ వరల్డ్ కప్ గెలవకపోయినా నేను టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించేవాడిని’ అని చెప్పుకొచ్చారు. మైదానంలో ఉన్న కోహ్లీ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.



Similar News