India vs West Indies 2nd T20I: తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. విండీస్ టార్గెట్ ఇదే

విండీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత బ్యాటర్లు తడబడ్డారు.

Update: 2023-08-06 16:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: విండీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత బ్యాటర్లు తడపడ్డారు. మొదటి టీ20లో టాప్ స్కోరర్‌గా నిలిచిన తిలక్ వర్మ హాఫ్ సెంచరీతో రాణించినా మిగిలిన బ్యాటర్ల నుంచి సరైన సహకారం లభించలేదు. దీంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 152 పరుగుల స్కోరు మాత్రమే చేయగలిగింది. ఇషాన్ కిషన్ (27), హార్దిక్ (24), అక్షర్ (14), పర్వాలేదనిపించారు. గిల్, సూర్య, శాంసన్ విఫలమయ్యారు. విండీస్ బౌలర్‌లో.. హోసైన్, జోసెఫ్, షపర్డ్ తలో 2 వికెట్లు తీశారు.


Similar News