దిశ, వెబ్డెస్క్: ఆసియా క్రీడల్లో ఇండియాకు మరో స్వర్ణ పతకం దక్కింది. టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్లో బొపన్న జోడికి పతకం వచ్చింది. దీంతో ఆసియా క్రీడల్లో భారత్ స్వర్ణాల సంఖ్య 9కి చేరుకున్నది. టెన్నిస్ ఈవెంట్లో ఇండియా మొత్తం రెండు మెడల్స్ మాత్రమే కైవసం చేసుకున్నది. ఇవాళ జరిగిన మిక్స్డ్ డబుల్స్ గేమ్లో బొపన్న, రుతుజా భోస్లే అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించింది. తొలుత ఓ సెట్ను కోల్పోయినా.. ఆ తర్వాత ఇద్దరూ తమ పవర్ గేమ్తో ఆకట్టుకున్నారు. రెండో సీడ్గా బరిలోకి దిగిన బొపన్న-భోస్లే జోడి 2-6, 6-3, 10-4 తేడాతో తైపికి చెందిన సుంత్ హో హువాంగ్, ఇన్ షౌ లియాంగ్ జంటపై గెలుపొందారు. ఆసియా క్రీడల్లో బొప్పన్నకు స్వర్ణ పతకం దక్కడం ఇది రెండోసారి.