Ravichandran Ashwin: మరోసారి విండీస్‌ బోర్డు తీరుపై అశ్విన్‌ ఫైర్..

విండీస్‌ క్రికెట్ మైదానాల్లో సరైన సదుపాయాలు లేవని విమర్శలు గుప్పించిన రవిచంద్రన్ అశ్విన్‌ మరోసారి ట్విటర్‌ వేదికగా స్పందించాడు.

Update: 2023-08-09 10:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: విండీస్‌ క్రికెట్ మైదానాల్లో సరైన సదుపాయాలు లేవని విమర్శలు గుప్పించిన రవిచంద్రన్ అశ్విన్‌ మరోసారి ట్విటర్‌ వేదికగా స్పందించాడు. భారత్-విండీస్‌ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్‌ ఆలస్యంగా ప్రారంభం కావడంపై విమర్శించాడు. 30 అడుగుల సర్కిల్‌ను మార్క్‌ చేయడంలో గయానా మైదానం సిబ్బంది జాప్యం చేశారు. దీంతో మ్యాచ్‌ దాదాపు 5 నిమిషాలపాటు ఆలస్యంగా ప్రారంభమైంది. దీనిని ఉద్దేశిస్తూ అశ్విన్‌ ట్వీట్ చేశాడు. ‘‘ఇది ప్రత్యేకమైన జాప్యం. ఇలాంటి కారణాలతో పర్యటించడం అంత సులువేం కాదు. క్రికెటర్‌గా ఇలాంటి ఊహించని పరిస్థితులను కూడా తీసుకోవాల్సి ఉంటుంది’’ అని పేర్కొన్నాడు.


Similar News