ఆ ఐపీఎల్ జట్టుకు మెంటార్గా వెళ్లబోతున్న ద్రవిడ్?
: టీమ్ ఇండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 వరల్డ్ కప్తో ముగిసిన విషయం తెలిసిందే.
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 వరల్డ్ కప్తో ముగిసింది. అతని హయాంలో భారత జట్టు వరల్డ్ టెస్టు చాంపియన్షిప్, వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ఫైనల్కు చేరింది. ఇటీవల టీ20 వరల్డ్ కప్ టైటిల్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో అతని కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలు పోటీపడుతున్నాయి. కోచ్గా లేదా మెంటార్గా తీసుకోవాలని భావిస్తున్నాయి.
తాజాగా ద్రవిడ్ను కోల్కతా నైట్రైడర్స్ మేనేజ్మెంట్ సంప్రదించినట్టు తెలుస్తోంది. మెంటార్ రోల్ గురించి చర్చించినట్టు సమాచారం. ప్రస్తుతం భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఆ జట్టు మెంటార్గా ఉన్నాడు. ఈ ఏడాది ఆ జట్టు టైటిల్ గెలవడంలో గంభీర్ కీలక పాత్ర పోషించాడు. అయితే, టీమ్ ఇండియా హెడ్ కోచ్గా అతని నియామకం లాంఛనమే అన్న వార్తలు వస్తున్నాయి.
భారత ప్రధాన కోచ్గా నియామకమైతే కేకేఆర్ మెంటార్గా తప్పుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కేకేఆర్ మేనేజ్మెంట్ కొత్త మెంటార్ కోసం ద్రవిడ్ను కలిసినట్టు తెలుస్తోంది. టీమ్ ఇండియా ప్రధాన కోచ్గా సేవలందించిన ద్రవిడ్ అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని కేకేఆర్ భావిస్తోంది. ద్రవిడ్ రాకతో జట్టులో కొత్త వ్యూహాత్మక దృష్టి, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని కేకేఆర్ ఆశిస్తున్నది. మరి, ద్రవిడ్ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.