Paris Olympics : టీమిండియాకు శుభవార్త.. సెమీస్ చేరిన రెజ్లర్ అమన్ సెహ్రావత్
భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేష్ ఫొగట్ , మరో మహిళా రెజ్లర్ అంతిమ్ పంగల్ పై ఒలింపిక్ నిర్వాహకులు అనర్హత వేటు వేశారన్న విషయం తెలిసిందే.
దిశ, వెబ్డెస్క్ : భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేష్ ఫొగట్ , మరో మహిళా రెజ్లర్ అంతిమ్ పంగల్ పై ఒలింపిక్ నిర్వాహకులు అనర్హత వేటు వేశారన్న విషయం తెలిసిందే. దీంతో తీవ్ర నిరాశలోకి వెళ్ళిపోయిన భారత క్రీడాభిమానులకు ఈ వార్త కొంచెం ఉపశమనం కలిగించిందనే చెప్పాలి. ఈ రోజు జరిగిన పురుషుల క్వార్టర్ ఫైనల్ 57 కేజీల విభాగంలో అమన్ సెహ్రావత్ ఘన విజయం సాధించాడు . తొలి ఒలింపిక్స్లో పోటీపడుతున్నఅమన్ సెహ్రావత్ ,అల్బేనియా దేశానికి చెందిన రెజ్లర్ జెలింఖాన్ పై 12-0 తేడాతో అద్భుత విజయం సాధించి సెమీఫైనల్ కు దూసుకువెళ్ళాడు . దీంతో అతను పతకం సాధించడానికి ఒక్క విజయం దూరంలో నిలిచాడు. అమన్ ఈ రోజు రాత్రి జరిగే సెమీ-ఫైనల్లో జపాన్ రెజ్లర్ రీ హిగుచితో తలపడనున్నాడు.