Paris Olympics : భారత్కు బిగ్ షాక్.. మరో మహిళా రెజ్లర్పై వేటు..!
పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి.
దిశ, వెబ్డెస్క్ : పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే 50 కేజీల కుస్తీ విభాగంలో 100 గ్రాముల బరువు ఎక్కువున్న కారణంగా స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్పై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు మరో భారత మహిళా రెజ్లర్పైన అనర్హత వేటు పడే అవకాశం ఉంది. అంతిమ్ పంగల్ (Antim Panghal) తన అక్రిడిటేషన్ కార్డును దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలు వస్తున్నాయి. అంతిమ్ పంగల్కు ఇచ్చిన అక్రిడిటేషన్ కార్డును రద్దు చేసిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC).. ఇప్పుడు తదుపరి చర్యలకు సిద్ధమవుతోంది. IOC అంతిమ్ పంగల్పై అనర్హత వేటు వేస్తే ఆమె కాంస్య పతక పోరుకు దూరం కావాల్సి ఉంటుంది. అదే జరిగితే భారతదేశానికి మరో గట్టి షాకె అని చెప్పాలి .
ఒలింపిక్స్ క్రీడల్లో అంతిమ్ పంగల్ మహిళల ఫ్రీస్టైల్ 53 కేజీల విభాగంలో తుర్కియే రెజ్లర్ యెట్గిల్ చేతిలో క్వార్టర్స్ ఫైనల్లో యెట్గిల్ చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత తన రూంకు వెళ్లిన అంతిమ్.. తన సిస్టర్ నిషాకి ఒలింపిక్ విలేజ్కు ఎంట్రెన్స్ ఉన్న అక్రిడిటేషన్ కార్డు ఇచ్చి ఒలింపిక్ విలేజ్లోని తన వస్తువులు తేవాలని కోరింది. అంతిమ్ పంగల్ ఇచ్చిన అక్రిడిటేషన్ కార్డుతో ఒలింపిక్ విలేజ్కి వెళ్లిన నిషా.. వస్తువులు తీసుకుని తిరిగి వస్తుండగా విలేజ్ భద్రత సిబ్బంది ఆపి ఆరా తీశారు. తన సిస్టర్ వస్తువులు తీసుకు వెళ్లేందుకు వచ్చానని చెప్పడంతో ఆమె స్టేట్మెంట్ రికార్డు చేశారు. అనంతరం అంతిమ్ను విలిచి ఆమె స్టేట్మెంట్నూ రికార్డు చేశారు. నిబంధనల ప్రకారం ఒక ప్లేయర్ అక్రిడిటేషన్ కార్టు మీద ఇంకొకరు రావడం ఉల్లంఘన కిందకు వస్తుంది. దీంతో అక్రిడిటేషన్ కార్డును దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలతో అమిత్ పంగల్పై ఒలింపిక్స్ నిర్వహక కమిటీ వేటు వేసే అవకాశం ఉంది.దీంతో ఆమె కాంస్య పతక పోరుకు దూరమయ్యే అవకాశం ఉంది. దీంతో ‘రెపిఛేజ్’ ద్వారా కాంస్య పతక పోటీలో నిలవాలనే అంతిమ్ పంగల్ ఆశలపై నీళ్లు చల్లినట్లే అవుతుంది.కాగా అంతిమ్ పంగల్ విషయంలోనూ ఒలింపిక్స్ నిర్వాహకులతో చర్చలు జరుపుతున్నట్లు భారత ఒలింపిక్ సంఘం వెల్లడించింది.