పారా ఒలంపిక్స్.. భారత్ ఖాతాలోకి మరో రెండు పతకాలు

పారిస్ పారా ఒలంపిక్స్ లో భారత క్రీడాకారుల పతకాల వేత సాగుతోంది.

Update: 2024-08-30 12:59 GMT

దిశ, వెబ్ డెస్క్ : పారిస్ పారా ఒలంపిక్స్ లో భారత క్రీడాకారుల పతకాల వేత సాగుతోంది. ఇప్పటికే షూటింగ్ విభాగంలో అవనీ బంగారు పతకం, మోనా కాంస్య పతకం సాధించగా.. పురుషుల షూటింగ్ 10మీ ఎయిర్ పిస్టల్ ఎస్ హెచ్ ఫైనల్ లో మనీష్ నర్వాల్ రజత పతకాన్ని సాధించాడు. మూడు రౌండ్లలో మనీష్ 234.9 పాయింట్స్ సాధించి రెండో స్థానంలో నిలిచాడు. ఇక మహిళల 100 మీ. టీ35 పరుగు పందెంలో ప్రీతి పాల్ కాంస్య పతకాన్ని సాధించింది. నిర్దేశిత లక్ష్యాన్ని ప్రీతి 14.21 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. దీంతో భారత్ మొత్తం 4 పతకాలను తన ఖాతాలో వేసుకుంది.        


Similar News