Nicholas Pooran: నికోలస్ పూరన్కు ఐసీసీ షాక్.. ఫైన్తో పాటు..
వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్కు ఐసీసీ షాకిచ్చింది.
దిశ, వెబ్డెస్క్: వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్కు ఐసీసీ షాకిచ్చింది. భారత్తో ఆదివారం జరిగిన రెండో టీ20లో అంపైరింగ్ నిర్ణయాలను వ్యతిరేకించినందుకు అతనిపై కఠిన చర్యలు తీసుకుంది. అంపైర్ల నిర్ణయాన్ని బహిరంగంగా విమర్శించాడనే అభియోగాలతో అతనిపై కఠిన చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో నికోలస్కు భారీ జరిమానాతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ విధించింది.
మరోవైపు అంపైర్ల ఫిర్యాదుతో ఈ ఘటనపై విచారణ జరిపిన మ్యాచ్ రిఫరీ.. నికోలస్ ఐసీసీ నిబంధనల్లోనీ లెవెల్ 1 తప్పిదం చేశాడని గుర్తించి అతనిపై చర్యలు తీసుకున్నాడు. మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించడంతో పాటు నిబంధనల ప్రకారం ఓ డీమెరిట్ పాయింట్ విధించాడు. అయితే ఐసీసీ నిబంధనల ప్రకారం ఓ ప్లేయర్ ఏడాది కాలంలో నాలుగు డీమెరిట్ పాయింట్స్ పొందాడంటే.. ఇక అతను రెండు వైట్బాల్ గేమ్స్తో పాటు ఓ టెస్ట్ మ్యాచ్ ఆడకుండా నిషేధం ఎదుర్కొవాల్సి ఉంటుంది.
అసలేం జరిగింది..
వెస్టిండీస్ ఇన్నింగ్స్ సమయంలో అర్ష్దీప్ సింగ్ వేసిన రెండో ఓవర్లో నికోలస్ పూరన్ను అంపైర్ ఎల్బీగా ప్రకటించాడు. అయితే ఈ నిర్ణయాన్ని తప్పుబట్టిన పూరన్ రివ్యూ తీసుకొని.. ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అయితే స్పష్టంగా నాటౌట్ అని తెలుస్తున్నా ఔటివ్వడం వల్ల పూరన్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న అంపైర్ను దూషించాడు. దీంతో మ్యాచ్ తర్వాత పూరన్పై అంపైర్లు మ్యాచ్ రిఫరికీ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సరైన విచారణ చేపట్టిన రిఫరీ పూరన్పై చర్యలు తీసుకున్నాడు.