లంకపై న్యూజిలాండ్ గ్రాండ్ విక్టరీ.. సిరీస్ కైవసం
మూడు టీ20ల సిరీస్లో భాగంగా కొలొంబో వేదికగా శ్రీలంకతో ఇవాళ జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది.
దిశ, వెబ్డెస్క్: మూడు టీ20ల సిరీస్లో భాగంగా కొలొంబో వేదికగా శ్రీలంకతో ఇవాళ జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్లో భాగంగా 2-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. బౌలింగ్లో లీ తహుహు 4 వికెట్లు తీయగా.. బ్యాటింగ్లో సుజీ బేట్స్ (52), మెలీ కెర్ (33 నాటౌట్) తో రాణించగా కివీస్ను గెలిపించారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదటగా బౌలింగ్ తీసుకోగా.. శ్రీలంక 6 వికెట్ల నష్టానికి 118 రన్స్ మాత్రమే చేసింది.
శ్రీలంక బ్యాటర్స్లో హసిని పెరీరా (33), హర్షిత మాధవి (23), నీలాక్షి డిసిల్వ (22) ఓ మోస్తరు పరుగులు చేయగా.. వరుస సెంచరీలు సాధించి భీకర ఫామ్లో ఉన్న కెప్టెన్ అటపట్టు (2) నిరాశపర్చింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్ సుజీ బేట్స్ (52), మెలీ కెర్ (33 నాటౌట్) తో రాణించగా 18.4 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. లంక బౌలర్లలో కవిశ దిల్హరి, ఇనోకా రణవీర తలో వికెట్ పడగొట్టారు.
A half-century from Suzie Bates spearheaded New Zealand to a series-clinching win in the second #SLvNZ T20I 👊
— ICC (@ICC) July 10, 2023
📝 Scorecard: https://t.co/ZLoGshvG6t pic.twitter.com/6fDFG6VBnu