'రూ.30 లక్షలు సంపాదించి.. క్రికెట్ వదిలేస్తా'

టీమిండియా లెజెండరీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన 42వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు.

Update: 2023-07-07 12:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా లెజెండరీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నేడు (జూలై 7) తన 42వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. మాజీ క్రికెటర్లు, సహచర ఆటగాళ్లు అందరూ ధోనీకి విషెస్ చెప్తున్నారు. ఇక నెట్టింట ఫ్యాన్స్ హంగామా అంతా ఇంతా కాదు. ఇలాంటి సమయంలో ధోనీ గురించి ఎవరికీ తెలియని ఒక విషయాన్ని మాజీ దిగ్గజం వసీం జాఫర్ వెల్లడించాడు. కేవలం రూ.30 లక్షలు ఉంటే చాలు, జీవితాంతం కూర్చొని బతికేయొచ్చని అనుకున్నాడట. ‘‘అంతర్జాతీయ క్రికెట్‌లోకి రాకముందు ఓ సారి ధోనీ మా ఇంటికి వచ్చాడు.

అప్పుడు నా భార్యతో ‘బాబీ.. నేను రూ.30 లక్షలు సంపాదించాలి. ఆ 30 లక్షలు సంపాదిస్తే, ఇక ఈ క్రికెట్‌కి వదిలేస్తా.. అయితే ఏది ఏమైనా నేను రాంఛీని మాత్రం వదిలి వెళ్లను..’ అని చెప్పాడు.. ఆ మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి . ధోనీ చాలా చిన్న చిన్న కలలు కంటాడు. వాటిని నిజం చేసుకుంటూ ముందుకు వెళ్తాడు. ధోనీ టార్గెట్స్ ఎప్పుడూ పెద్దగా ఉండవు. అందుకే సక్సెస్ చాలా పెద్దగా ప్రపంచానికి వినిపించింది..’’ అంటూ చెప్పుకొచ్చాడు వసీం జాఫర్. ఇప్పుడు భారత దేశంలో అత్యధికంగా సంపాదించే క్రికెటర్లలో ధోనీ ఒకడు కావడం గమనార్హం. ఇటీవలే సినిమా నిర్మాణంలో కూడా ధోనీ ప్రవేశించిన సంగతి తెలిసిందే. తమిళ్‌లో ఒక సినిమా కూడా మొదలు పెట్టాడు.


Similar News