దిశ, వెబ్డెస్క్: అగ్రరాజ్యం అమెరికా తొలిసారిగా నిర్వహిస్తున్న ఫ్రాంచైజీ టోర్నీ మేజర్ లీగ్ క్రికెట్కు సర్వం సిద్దమైంది. జూలై 13న డల్లాస్ వేదికగా టెక్సాస్ సూపర్ కింగ్స్, లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ మధ్య జరగనున్న మ్యాచ్తో ఈ టోర్నీ షురూ కానుంది. కాగా ఐపీఎల్లోని నాలుగు ప్రధాన ప్రాంఛైజీలు ఎంఎల్సీలో జట్లను సొంతం చేసుకున్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్లు ఎంఎల్సీలో ఫ్రాంచైజీలను దక్కించుకున్నాయి. ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్.. న్యూయార్క్ ఫ్రాంచైజీని దక్కించుకోగా.. సీఎస్కే మాదిరిగానే ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన చెన్నై సూపర్ కింగ్స్.. టెక్సాస్ టీమ్ను కొనుగోలు చేసింది. కోల్కతా నైట్ రైడర్స్ టీమ్ లాస్ ఏంజెల్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేయగా ఢిల్లీ క్యాపిటల్స్:.. సియాటెల్ను దక్కించుకుంది.
లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ కెప్టెన్గా సునీల్ నరైన్..
ఇక కోల్కతా నైట్రైడర్స్ యాజమాన్యం కొనుగోలు చేసిన లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్గా వెస్టిండీస్ స్టార్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ ఎంపికయ్యాడు. ఐపీఎల్లో కేకేఆర్కు గత కొన్ని సీజన్లగా నరైన్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.