ఒలంపిక్ ప్లేయర్ కి కేరళ బంపర్ ఆఫర్

పారిస్ ఒలంపిక్స్ హాకీలో భారత జట్టుకు కాంస్య పతకాన్ని అందించిన కీలక ఆటగాడు శ్రీజేష్ కు కేరళ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది.

Update: 2024-08-21 13:32 GMT

దిశ, వెబ్ డెస్క్ : పారిస్ ఒలంపిక్స్ హాకీలో భారత జట్టుకు కాంస్య పతకాన్ని అందించిన కీలక ఆటగాడు శ్రీజేష్ కు కేరళ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. బుధవారం కేరళ సీఎం పినరయి వియజన్ శ్రీజేష్ కు రూ.2 కోట్ల బహుమతి ప్రకటించారు. కేరళకు చెందిన శ్రీజేష్ భారత హాకీ జట్టులో గోల్ కీపర్. ఒలంపిక్ లో జట్టు పతకం సాధించిన వెంటనే తన రిటైర్మెంట్ ప్రకటించాడు. 20 ఏళ్ల సుధీర్ఘ కెరీర్ లో ఆటగాడిగా జట్టులో మంచి పేరు ఉండటమే కాదు.. దేశానికి రెండు ఆసియా క్రీడల స్వర్ణ పతకాలు, రెండు కామన్ వెల్త్ రజత పతకాలు, రెండు ఛాంపియన్ ట్రోఫీలతో పాటు, రెండు ఒలంపిక్ కాంస్య పతకాలు అందించడంలో కీలక పాత్ర పోషించాడు శ్రీజేష్. రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం శ్రీజేష్ ను భారత జూనియర్ హాకీ జట్టుకు కోచ్ గా నియమించింది హాకీ ఇండియా.        


Similar News