కెప్టెన్‌గా రోహిత్ శర్మ కొనసాగడంపై జైషా కీలక వ్యాఖ్యలు

బీసీసీఐ సెక్రటరీ జైషా టీ20 ప్రపంచ కప్ సాధించిన భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే భారత జట్టుకు కెప్టెన్ గా రోహిత్ శర్మ కంటిన్యూ కావడంపై ఆయన క్లారిటీ ఇచ్చారు.

Update: 2024-07-07 09:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీసీసీఐ సెక్రటరీ జైషా టీ20 ప్రపంచ కప్ సాధించిన భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే భారత జట్టుకు కెప్టెన్ గా రోహిత్ శర్మ కంటిన్యూ కావడంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఓ వీడియో ను విడుదల చేసి జై షా.. వీడియో లో.. "...రోహిత్ శర్మ కెప్టెన్సీలో మేము WTC ఫైనల్, ఛాంపియన్స్ ట్రోఫీని గెలుస్తామని నాకు నమ్మకం ఉంది" అని చెప్పుకొచ్చాడు. దీంతో రోహిత్ శర్మ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్, అలాగే వన్డే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీల వరకు కెప్టెన్ గా కొనసాగుతున్నట్లు క్లారిటీ వచ్చింది. ఈ వార్తతో రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి‌లో ఉన్నారు.


Similar News