Ishant Sharma: విండీస్ గడ్డపై కామెంటేటర్గా భారత ఫాస్ట్ బౌలర్..
కొన్నాళ్లుగా టీమ్ ఇండియాలో చోటు దక్కించుకోవడంలో విఫలమవుతోన్న ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ ఇప్పుడు కొత్త అవతారం ఎత్తనున్నాడు.
న్యూఢిల్లీ : కొన్నాళ్లుగా టీమ్ ఇండియాలో చోటు దక్కించుకోవడంలో విఫలమవుతోన్న ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ ఇప్పుడు కొత్త అవతారం ఎత్తనున్నాడు. జూలై 12 నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య జరగనున్న రెండు టెస్టుల సిరీస్లో కామెంటరీ బాక్స్లో లంబూ సందడి చేయనున్నాడు. జియో సినిమాలో అతడి హిందీ కామెంట్రీని లైవ్లో మనం చూడొచ్చు.
కామెంటేటర్గా ఇషాంత్కు ఇదే తొలి సిరీస్. 2011లో బ్రిడ్జ్టౌన్లో వెస్టిండీస్తో జరిగిన టెస్టు మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లలో కలుపుకొని ఇషాంత్ శర్మ 10 వికెట్లు తీశాడు. ఇప్పుడు మళ్ళీ విండీస్పైనే ఇషాంత్ కామెంటేటర్గా కెరీర్ను ప్రారంభిస్తుండటం విశేషం. త్వరలో ఇషాంత్ శర్మ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.