India vs West Indies 3rd ODI: ఇషాన్ కిషన్ అరుదైన ఘనత.. మూడో వన్డేలోనూ హాఫ్ సెంచరీ

Update: 2023-08-01 14:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: వెస్టిండీస్ టూర్‌లో ఓపెనర్‌గా ప్రమోషన్ దక్కించుకున్న భారత యంగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అరుదైన ఘనత సాధించాడు. వెస్టిండీస్‌లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు చేసిన మొట్టమొదటి భారత వికెట్ కీపర్‌గా నిలిచాడు ఇషాన్ కిషన్. అంతకుముందు రెండు సార్లు హాఫ్ సెంచరీలు చేసిన ధోనీ రికార్డును ఇషాన్ కిషన్ అధిగమించాడు. తొలి రెండు వన్డేల్లో హాఫ్ సెంచరీలు చేసిన ఇషాన్ కిషన్.. వరుసగా మూడో వన్డేలోనూ 50+ స్కోరు నమోదు చేశాడు. ఓవరాల్‌గా ఇషాన్ కిషన్‌కి ఇది వరుసగా నాలుగో 50+ స్కోరు. 15 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 110 పరుగులు చేసింది టీమిండియా. అంతకుముందు టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.


Similar News