Indonesia open 2023: చరిత్ర సృష్టించిన సాత్విక్–చిరాగ్.. తొలి భారత జోడీగా రికార్డ్
దిశ, వెబ్డెస్క్: ఇండోనేసియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్లో విజేతగా నిలిచి సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ చరిత్ర సృష్టించింది. తుది పోరులో ఏడో సీడ్గా బరిలోకి దిగిన సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడి మలేషియాకు చెందిన అరోన్చియా-సో వూయ్ఇక్ జోడీని 21-17, 21-18 తేడాతో ఓడించింది. బీడబ్ల్యూఎఫ్వరల్డ్ టూర్ సూపర్ 1000 టైటిల్లో గెలిచిన తొలి భారత్జోడీగా రికార్డుకెక్కింది.