భారత్, శ్రీలంక పరిమిత ఓవర్ల సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు

ఈ నెల చివర్లో భారత జట్టు పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం శ్రీలంకలో పర్యటించనుంది.

Update: 2024-07-13 17:30 GMT

దిశ, స్పోర్ట్స్ : ఈ నెల చివర్లో భారత జట్టు పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం శ్రీలంకలో పర్యటించనుంది. ఇప్పటికే టీ20, వన్డే సిరీస్‌ల షెడ్యూల్ ఖరారవ్వగా.. తాజాగా అందులో మార్పులు చోటుచేసుకున్నాయి. రివైజ్డ్ షెడ్యూల్‌ను బీసీసీఐ శనివారం రిలీజ్ చేసింది. ఈ నెల 26న జరగాల్సిన తొలి టీ20 ఒక్క రోజు వెనక్కి అంటే 27న జరగనుంది. 27న జరగాల్సిన రెండో టీ20 28వ తేదీకికి, 29న జరిగే మూడో టీ20 30వ తేదీకి మారాయి. అలాగే, ఆగస్టు 1న జరిగే తొలి వన్డే 2వ తేదీకి మార్చారు. మిగతా రెండు వన్డే మ్యాచ్‌ల తేదీల్లో ఎలాంటి మార్పు లేదు. ఆగస్టు 4, 7 తేదీల్లో జరగనున్నాయి. ఈ సిరీస్‌కు బీసీసీఐ వచ్చే వారంలో జట్టును ప్రకటించే అవకాశం ఉంది. 


Similar News