దిశ, వెబ్డెస్క్: చైనా వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత పురుషుల హాకీ టీమ్ జైత్రయాత్ర కొనసాగుతున్నది. బుధవారం జరిగిన సెమీ ఫైనల్లో ప్రత్యర్థి దక్షిణ కొరియా భారత హాకీ టీమ్ 5-3 తేడాతో ఓడించింది. సెమీ ఫైనల్ మ్యాచ్లో హార్దిక్ సింగ్ మన్దీప్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్, అమిత్ రోహిదాస్, అభిషేక్ తలా ఒక గోల్ చేశారు. దక్షిణ కొరియా కేవలం మూడు గోల్స్ మాత్రమే చేయగలిగింది. శుక్రవారం జరగనున్న ఫైనల్లో చైనా లేదా జపాన్తో భారత్ తలపడనుంది. రేపు చైనా, జపాన్ నడుమ రెండో సెమీస్ జరగనుంది.
The #MenInBlue🔵 are now in the FINAL after defeating 🇰🇷 5⃣- 3⃣
— SAI Media (@Media_SAI) October 4, 2023
Many congratulations boys!
Go, get us🥇💪🏻#AsianGames2022#Cheer4India#HallaBol#JeetegaBharat#BharatAtAG22 pic.twitter.com/JRYEHwNx6w