మాజీ క్రికెటర్‌కు యాక్సిడెంట్‌.. స్పాట్‌లో భార్య మృతి

Update: 2023-04-19 16:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: మాజీ రంజీ క్రికెటర్‌ ప్రవీణ్‌ హింగానికర్‌ బుధవారం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని మెకర్‌ తాలుకా సమీపంలోని సంవృద్ది హైవేపై ఆగి ఉన్న ట్రక్‌ను కారు వెనుక నుంచి ఢీ కొట్టింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. ప్రవీణ్‌ భార్య సువర్ణ హింగానికర్‌ స్పాట్‌లోనే మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన ప్రవీణ్‌ను మెకర్‌ రూలర్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందింస్తున్నారు. డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండడమే ప్రమాదానికి కారణం అని తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రవీణ్‌ హింగానికర్‌ విదర్భ తరఫున రంజీ క్రికెట్‌ ఆడాడు. ప్రవీణ్‌ 52 మ్యాచ్‌ల్లో 1,400 పరుగులతో పాటు 47 వికెట్లు తీసుకున్నాడు. 11 లిస్ట్‌-ఏ మ్యాచ్‌ల్లో 271 పరుగులు చేయడంతో పాటు ఏడు వికెట్లు పడగొట్టాడు. 2008 నుంచి 2018 వరకు నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియానికి క్యురేటర్‌గా వ్యవహరించాడు. ప్రస్తుతం ప్రవీణ్‌ హింగానికర్‌ బీసీబీ ప్రధాన పిచ్‌ క్యురేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.

Tags:    

Similar News