టీమిండియాను కట్టడి చేసిన బంగ్లా బౌలర్లు..

ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌-టీమిండియాల మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియాను బంగ్లాదేశ్‌ బౌలర్లు కట్టడి చేశారు.

Update: 2023-07-11 10:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌-టీమిండియాల మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియాను బంగ్లాదేశ్‌ బౌలర్లు కట్టడి చేశారు. టీమిండియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 95 పరుగలు మాత్రమే చేయగలిగింది. బంగ్లా బౌలర్లలో సుల్తానా ఖాతూన్‌ 3 వికెట్లతో తీయగా.. ఫాతిమా ఖాతూన్‌ 2, మరూఫా అక్తెర్‌, నమిద అక్తెర్‌, రబెయా ఖాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. భారత బ్యాటర్లలో ఒక్కరు కూడా కనీసం 20 పరుగుల మార్కును దాటలేకపోయారు.

ఓపెనర్‌ షఫాలీ వర్మ చేసిన 19 పరుగులే టాప్‌ భారత ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోర్‌గా నిలిచింది. షఫాలీ సహా స్మృతి మంధన (13), యస్తిక భాటియా (11), దీప్తి శర్మ (10), అమన్‌జోత్‌ కౌర్‌ (14) రెండంకెల స్కోర్లతో మాత్రమే చేశారు. ఈ సిరీస్‌లో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.


Similar News