Ind vs Aus: భారత్లో అడుగుపెట్టిన ఆసీస్ క్రికెటర్లు.. వార్నర్ పోస్ట్ వైరల్
సౌతాఫ్రికా పర్యటన ముగించుకున్న ఆస్ట్రేలియా టీమిండియాతో సిరీస్కు సిద్ధమైంది.
దిశ, వెబ్డెస్క్: సౌతాఫ్రికా పర్యటన ముగించుకున్న ఆస్ట్రేలియా టీమిండియాతో సిరీస్కు సిద్ధమైంది. ఈ క్రమంలో వన్డే వరల్డ్కప్-2023కి ముందు చివరిసారిగా రోహిత్ సేనతో తలపడనున్నారు. ఈ నేపథ్యంలో ఆసీస్ క్రికెటర్లు భారత్కు చేరుకున్నారు. వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సహా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ, మిచెల్ మార్ష్ తదితరులు ఇండియాలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా వార్నర్ భాయ్ భావోద్వేగ నోట్ షేర్ చేశాడు. ‘‘ఇండియాలో మళ్లీ అడుగుపెట్టడం.. ఎల్లప్పుడూ గొప్పగానే అనిపిస్తుంది. ఇక్కడ మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు’’ అంటూ భద్రతా సిబ్బందితో దిగిన ఫొటోను షేర్ చేశారు. సెప్టెంబరు 22-27 వరకు మొహాలీ, ఇండోర్, రాజ్కోట్లలో టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్లు జరుగునున్నాయి.