దిశ, వెబ్డెస్క్: ఆసియా క్రీడల్లో భారత ఫుట్బాల్ జట్టు పోరాటం ముగిసింది. సౌదీ అరేబియాతో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో భారత్ను సౌదీ 2-0 తేడాతో మట్టికరిపించింది. ఈ ఓటమితో ఆసియా క్రీడల నుంచి భారత జట్టు నిష్క్రమించింది. తొలి అర్ధభాగంలో ఇరుజట్లు గోల్ చేయలేకపోయాయి. రెండో అర్ధ భాగం మొదలైన కొద్దిసేపటికి మహ్మద్ ఖలీల్ మర్రాన్ (51వ నిమిషం) గోల్ చేసి సౌదీ అరేబియాను ఆధిక్యంలో నిలిపాడు. అతడు కాసేపటికే (57వ నిమిషం) మరో గోల్ చేయడంతో సౌదీ ఆధిక్యం రెట్టింపయ్యింది.