Asian Games-2023: సెమీ ఫైనల్స్‌లోకి భారత పురుషుల జట్టు.. బంగ్లాదేశ్‌‌పై టీమిండియా ఘన విజయం

చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్టు జైత్రయాత్ర కొనసాగుతున్నది.

Update: 2023-10-02 12:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్టు జైత్రయాత్ర కొనసాగుతున్నది. పూల్‌-ఎ లో జరిగిన అన్ని లీగ్‌ మ్యాచ్‌లలో భారత్‌ భారీ గోల్స్ తేడాతో ఘన విజయాలు నమోదు చేసింది. సోమవారం జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో కూడా బంగ్లాదేశ్‌పై 12-0 తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది.

పూల్‌-ఎ నుంచి టేబుల్‌ టాపర్‌గా భారత హాకీ జట్టు సెమీఫైనల్స్‌లో ప్రవేశించింది. సెమీస్‌లో గెలిస్తే భారత్‌కు రజత పతకం ఖాయం కానుంది. పూల్‌-ఎ లో ఇప్పటి వరకు జరిగిన ఐదు లీగ్‌ మ్యాచ్‌లలో భారత్‌ ఏకంగా 58 గోల్స్ సాధించింది.


Similar News