Asian Games 2023: చరిత్ర సృష్టించిన అన్నూ రాణి.. జావెలిన్ త్రోలో స్వర్ణం
Asian Games 2023లో భారత్ జోరు కొనసాగుతుంది.
దిశ, వెబ్డెస్క్: Asian Games 2023లో భారత్ జోరు కొనసాగుతుంది. మహిళల జావెలిన్ త్రోలో అన్నూ రాణి స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో 62.92 మీటర్లు దూరం వరకు జావెలిన్ విసిరి.. ఈ సీజన్ అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసింది. ఆసియా క్రీడల మహిళల జావెలిన్ త్రో విభాగంలో భారత్కు ఇదే తొలి స్వర్ణ పతకం కావడం విశేషం. మొత్తంగా బుధవారం 2 స్వర్ణాలు, రెండు రజతాలు, 5 కాంస్య పతకాలు సాధించింది భారత్. మొత్తంగా 15 స్వర్ణాలు, 26 రజతాలు, 28 కాంస్య పతకాలు గెలిచిన భారత్.. 69 పతకాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.