Ashes 2023: ఎడ్జ్బాస్టన్ పిచ్ను దానితో పోలుస్తూ.. వసీం జాఫర్ సెటైరికల్ ట్వీట్
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఆసీస్తో జరుగుతున్న యాషెస్ తొలి టెస్టులో ఇంగ్లండ్ ఆధిపత్యం చెలాయిస్తోంది.
దిశ, వెబ్డెస్క్: ఎడ్జ్బాస్టన్ వేదికగా ఆసీస్తో జరుగుతున్న యాషెస్ తొలి టెస్టులో ఇంగ్లండ్ ఆధిపత్యం చెలాయిస్తోంది. దూకుడుగా ఆడి తొలి ఇన్నింగ్స్ను 393/8 వద్ద డిక్లెర్ చేసిన ఇంగ్లీష్ జట్టు.. బౌలింగ్లో కూడా అదే తీరును కనబరుస్తుంది. ఇంగ్లండ్ బౌలర్ల దెబ్బకు డేవిడ్ వార్నర్, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్ వంటి స్టార్ ఆటగాళ్లు ఇప్పటికే పెవిలియన్కు చేరారు. ఎడ్జ్బాస్టన్ పిచ్ను చాలా ఫ్లాట్గా తాయారు చేశారని.. బౌలర్లకు ఏ మాత్రం అనుకూలించడం లేదని పలువురు మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు.
ఈ విషయంపై భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ తనదైన స్టైల్లో స్పందించాడు. ఎడ్జ్బాస్టన్ పిచ్ను హైవేతో పోలుస్తూ జాఫర్ సెటైరికల్ ట్వీట్ చేశాడు. ఎడ్జ్బాస్టన్ పిచ్ ఫోటోను తన ట్విట్టర్లో షేర్చేస్తూ.. 'పిచ్ను దగ్గరగా చూడండి అంటూ' సెటైరికల్ ట్వీట్ చేశాడు.
Closer look at the Edgbaston pitch #Ashes23 pic.twitter.com/0gNSMWdPim
— Wasim Jaffer (@WasimJaffer14) June 16, 2023