ఏబీ వెంకటేశ్వరరావుపై విచారణకు ప్రత్యేక అధికారి

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై మోపిన అభియోగాలపై ఏపీ ప్రభుత్వం విచారణ అధికారిని నియమించింది. కమిషనర్‌ ఆఫ్‌ ఇంక్వైరీస్‌ ఆర్పీ సిసోడియాను నియమిస్తూ సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సెక్షన్ 8 కింద ఏబీవీపై నమోదైన అభియోగాలపై ఆర్పీ సిసోడియా విచారణ చేపట్టనున్నారు. అలాగే అభియోగాలపై వాదనకు ప్రభుత్వ తరఫు న్యాయవాదిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అభియోగాలకు సంబంధించి వివరణను నిర్ణీత సమయంలో సమర్పించాలని […]

Update: 2021-07-27 10:27 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై మోపిన అభియోగాలపై ఏపీ ప్రభుత్వం విచారణ అధికారిని నియమించింది. కమిషనర్‌ ఆఫ్‌ ఇంక్వైరీస్‌ ఆర్పీ సిసోడియాను నియమిస్తూ సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సెక్షన్ 8 కింద ఏబీవీపై నమోదైన అభియోగాలపై ఆర్పీ సిసోడియా విచారణ చేపట్టనున్నారు. అలాగే అభియోగాలపై వాదనకు ప్రభుత్వ తరఫు న్యాయవాదిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అభియోగాలకు సంబంధించి వివరణను నిర్ణీత సమయంలో సమర్పించాలని ఏబీ వెంకటేశ్వరరావును ప్రభుత్వం ఆదేశించింది.

Tags:    

Similar News