బాగోతం బట్టబయలు.. పోలీసునే లంచం అడిగితే ఊరుకుంటాడా?

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు ‘దిశ’ పోలీస్ స్టేషన్‌లో అవినీతి అధికారుల బాగోతం కలకలం రేపింది. హోంగార్డుపై ఉన్న కేసును ఆసరాగా చేసుకొని లంచం ఇవ్వాలని ఎస్‌ఐ, కానిస్టేబుల్ బెదిరింపులకు గురిచేశారు. కేసు అనుకూలంగా మార్చుతామని, లంచం ఇవ్వాలని హోంగార్డును డిమాండ్ చేశారు. దీంతో డిపార్ట్‌మెంట్‌లో పనిచేసి, డిపార్ట్‌మెంట్‌ లొసుగులు తెలిసిన హోంగార్డు ఊరుకుంటాడా? ఏకంగా ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. లంచం ఇస్తూ.. రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టించాడు. దీంతో ఇరువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, […]

Update: 2021-07-26 03:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు ‘దిశ’ పోలీస్ స్టేషన్‌లో అవినీతి అధికారుల బాగోతం కలకలం రేపింది. హోంగార్డుపై ఉన్న కేసును ఆసరాగా చేసుకొని లంచం ఇవ్వాలని ఎస్‌ఐ, కానిస్టేబుల్ బెదిరింపులకు గురిచేశారు. కేసు అనుకూలంగా మార్చుతామని, లంచం ఇవ్వాలని హోంగార్డును డిమాండ్ చేశారు. దీంతో డిపార్ట్‌మెంట్‌లో పనిచేసి, డిపార్ట్‌మెంట్‌ లొసుగులు తెలిసిన హోంగార్డు ఊరుకుంటాడా? ఏకంగా ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. లంచం ఇస్తూ.. రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టించాడు. దీంతో ఇరువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, హోంగార్డు, అతని భార్య మధ్య ఉన్న వివాదం నేపథ్యంలో పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News