కుప్పకూలిన మార్కెట్లు!
దిశ, వెబ్డెస్క్: దేశీయ మార్కెట్లకు కోలుకోలేని దెబ్బ పడింది. ఇప్పటికే కరోనా ధాటికి విలవిల్లాడుతున్న మార్కెట్లకు ఈ వారాంతం కూడా భారీ నష్టాలు తప్పలేదు. ప్రైవేట్ బ్యాంకు యెస్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు విధించడంతో పెట్టుబడిదారుల్లో భయాన్ని పెంచింది. రూ. 50,000 విత్డ్రా పరిమితి విధించడం కూడా మార్కెట్ల పతనానికి కారణమైంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో మార్కెట్లకు సెలవు రోజులైన శని, ఆదివారాల్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయోననే ఆందోళనతో మదుపర్లు విక్రయాలకు సిద్ధమయ్యారు. ఈ పరిస్థితుల్లో శుక్రవారం […]
దిశ, వెబ్డెస్క్: దేశీయ మార్కెట్లకు కోలుకోలేని దెబ్బ పడింది. ఇప్పటికే కరోనా ధాటికి విలవిల్లాడుతున్న మార్కెట్లకు ఈ వారాంతం కూడా భారీ నష్టాలు తప్పలేదు. ప్రైవేట్ బ్యాంకు యెస్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు విధించడంతో పెట్టుబడిదారుల్లో భయాన్ని పెంచింది. రూ. 50,000 విత్డ్రా పరిమితి విధించడం కూడా మార్కెట్ల పతనానికి కారణమైంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో మార్కెట్లకు సెలవు రోజులైన శని, ఆదివారాల్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయోననే ఆందోళనతో మదుపర్లు విక్రయాలకు సిద్ధమయ్యారు. ఈ పరిస్థితుల్లో శుక్రవారం భారీ నష్టాలతో మొదలైన మార్కెట్లు క్లోజింగ్ సమయంలో కూడా తీవ్రంగా పతనమయ్యాయి.
సెన్సెక్స్ 893.99 పాయింట్ల నష్టంతో 37,576 వద్ద క్లోజవ్వగా, నిఫ్టీ 289.45 పాయింట్లను కోల్పోయి 10,979 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఇండెక్స్లోని సూచీల్లో బజాజ్ ఆటో, మారుతీ, ఏషియన్ పెయింట్స్ మినహా అన్నీ పతనంలోనే ట్రేడయ్యాయి. ఆటో, మెటల్ రంగాల షేర్లు తీవ్రమైన అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఎస్బీఐ సహా బ్యాంకింగ్ షేర్లు కూడా ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇండస్ఇండ్, టాటా స్టీల్, బజాజ్ ఫినాన్స్, ఐసిఐసిఐ బ్యాంక్ అత్యధిక శాతం నష్టపోయాయి.
tags : sensex, nifty, BSE, NSE, stock market