బ్రేకింగ్ న్యూస్.. రిపబ్లిక్ మూవీకి నిరసన సెగ

దిశ, ఏపీ బ్యూరో: సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమాకు ఏపీలో నిరసన సెగ తగిలింది. రిపబ్లిక్ మూవీపై కొల్లేరు గ్రామాల వాసులు మండిపడుతున్నారు. రిపబ్లిక్ సినిమాలో చెరువులను, చేపలను విషతుల్యం చేస్తున్నామని తమ గ్రామాలపై చిత్ర బృందం దుష్ప్రచారం చేసిందంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొల్లేరు వాసుల మనోభావాలు దెబ్బతిసే విధoగా దర్శకుడు దేవా కట్టా చిత్రీకరణ చేశారంటూ ధ్వజమెత్తారు. వెంటనే రిపబ్లిక్ సినిమాను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కొల్లేరు వాసులు […]

Update: 2021-10-05 05:43 GMT

దిశ, ఏపీ బ్యూరో: సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమాకు ఏపీలో నిరసన సెగ తగిలింది. రిపబ్లిక్ మూవీపై కొల్లేరు గ్రామాల వాసులు మండిపడుతున్నారు. రిపబ్లిక్ సినిమాలో చెరువులను, చేపలను విషతుల్యం చేస్తున్నామని తమ గ్రామాలపై చిత్ర బృందం దుష్ప్రచారం చేసిందంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొల్లేరు వాసుల మనోభావాలు దెబ్బతిసే విధoగా దర్శకుడు దేవా కట్టా చిత్రీకరణ చేశారంటూ ధ్వజమెత్తారు. వెంటనే రిపబ్లిక్ సినిమాను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కొల్లేరు వాసులు నిరసనకు దిగారు. రిపబ్లిక్ సినిమా ప్రదర్శన వెంటనే నిలిపివేయాలంటూ జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, కలెక్టర్ కార్తికేయ మిశ్రాకి వినతి పత్రం అందజేశారు. రిపబ్లిక్ సినిమా వెంటనే నిలిపివేయకపోతే ప్రత్యక్ష ఉద్యమానికి దిగుతామని హెచ్చరించారు.

Tags:    

Similar News