Trending: కరెంట్ షాక్‌తో ఎలక్ట్రీషియన్ మృతి.. నెట్టింట్లో వీడియో వైరల్

కరెంట్ షాక్‌తో స్పాట్‌లోనే ఓ ఎలక్ట్రీషియన్ ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది.

Update: 2024-09-25 08:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరెంట్ షాక్‌తో స్పాట్‌లోనే ఓ ఎలక్ట్రీషియన్ ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా (Ambedkar Konaseema District)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముమ్మిడివరం (Mummidivaram) మండలం అన్నంపల్లి టోల్‌గేటు సమీపంలోని నేషనల్ హైవే-216 పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్ లైన్‌లో అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలోనే లైన్‌ను మరమ్మతు చేసేందుకు ఓ ప్రైవేటు ఎలక్ట్రీషియన్ నిచ్చెన సాయంతో పోల్ ఎక్కాడు. అయితే, అప్పటికే ఆ లైన్‌పై విద్యుత్ సరఫరా నిలిపివేసినా.. జనరేటర్ నుంచి కరెంటు వెనక్కి ప్రసరించడంతో వ్యక్తి కరెంట్ షాక్‌తో స్తంభంపై నుంచి పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గమనించి స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే ఆ ఎలక్ట్రీషియన్ ప్రాణాలు విడిచాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో దగ్గరలోనే ఉన్న ఓ సీసీ టీవీ(CC Tv)లో రికార్డ్ కాగా.. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.


Similar News