మంత్రి ఆళ్ల నాని అటెండర్‌కు పాజిటివ్

ఏపీ వైద్యారోగ్య మంత్రి ఆళ్ల నాని పేషీలో కరోనా కలకలం సృష్టిస్తోంది.అక్కడ పనిచేస్తున్న అటెండర్‌కు కరోనా ట్రూనాట్ పరీక్షలో ప్రిజంప్టివ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో తుది నిర్ధారణకు అతని శాంపిల్స్‌ను వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. అనంతరం అటెండర్‌ను పిన్నమనేని సిద్దార్థ మెడికల్ కాలేజీకి తరలించారు. అధికారులకు ఈ విషయం తెలియడంతో మంత్రి నాని, ఆయన భద్రత సిబ్బంది, మంత్రి పేషీలో మొత్తంగా 12 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. మంగళవారం రాత్రి వచ్చిన ఫలితాల్లో వారందరికీ నెగెటివ్ […]

Update: 2020-04-28 21:23 GMT

ఏపీ వైద్యారోగ్య మంత్రి ఆళ్ల నాని పేషీలో కరోనా కలకలం సృష్టిస్తోంది.అక్కడ పనిచేస్తున్న అటెండర్‌కు కరోనా ట్రూనాట్ పరీక్షలో ప్రిజంప్టివ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో తుది నిర్ధారణకు అతని శాంపిల్స్‌ను వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. అనంతరం అటెండర్‌ను పిన్నమనేని సిద్దార్థ మెడికల్ కాలేజీకి తరలించారు. అధికారులకు ఈ విషయం తెలియడంతో మంత్రి నాని, ఆయన భద్రత సిబ్బంది, మంత్రి పేషీలో మొత్తంగా 12 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. మంగళవారం రాత్రి వచ్చిన ఫలితాల్లో వారందరికీ నెగెటివ్ రిపోర్టు వచ్చినట్లు వైరాలజీ ల్యాబ్ ప్రొఫెసర్ రత్నకుమారి వెల్లడించారు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Tags: minister alla nani, Pesi, attender, Corona positive, amaravathi, Coronavirus, Covid-19

Tags:    

Similar News