కొడుకులతో పారిస్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న యంగ్ టైగర్

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి పారిస్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ మేరకు భార్య ప్రణతి, కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌తో కలిసి పర్యాటక ప్రదేశాలు తిరుగుతూ ఎప్పటికప్పుడూ లేటెస్ట్ పిక్స్ షేర్ చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే తాజాగా తన చిన్న కొడుకుతో ట్రైన్‌లో ప్రయాణిస్తున్న ఫొటోను పంచుకోగా.. ఈ పిక్స్ చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. అంతేకాదు తన సతీమణి ఒడిలో కూర్చుని నవ్వుతున్న చిన్న […]

Update: 2021-11-23 08:18 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి పారిస్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ మేరకు భార్య ప్రణతి, కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌తో కలిసి పర్యాటక ప్రదేశాలు తిరుగుతూ ఎప్పటికప్పుడూ లేటెస్ట్ పిక్స్ షేర్ చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే తాజాగా తన చిన్న కొడుకుతో ట్రైన్‌లో ప్రయాణిస్తున్న ఫొటోను పంచుకోగా.. ఈ పిక్స్ చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.

అంతేకాదు తన సతీమణి ఒడిలో కూర్చుని నవ్వుతున్న చిన్న కొడుకు పిక్‌ను షేర్ చేస్తూ..‘నాకు ఎన్నో చెప్పాలని ఉంది. కానీ ఇప్పటికైతే ఈ జర్నీని ఎంజాయ్ చేస్తున్నా’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ పిక్స్‌పై స్పందించిన నెటిజన్లు ‘టైగర్ ఎక్కడో సేద తీరుతుంది’ అంటే.. మరొకరు ‘అన్నా దిష్టి తీసుకోవడం మరిచిపోవద్దు’ అంటూ కామెంట్ చేయడం విశేషం. ఇక అంతకుముందు పెద్ద కొడుకు అభయ్ రామ్‌ను ఈఫిల్ టవర్ దగ్గర ముద్దాడుతున్న పిక్‌ను అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే.

 

Tags:    

Similar News