'మీకు నాలాంటి అన్న దొరకడు.. నన్ను ఎంతగానో మిస్ అవుతారు'

Update: 2023-10-02 17:07 GMT

భోపాల్ : ఈ అసెంబ్లీ పోల్స్‌లో బీజేపీ టికెట్ ఇవ్వకపోవచ్చనే ప్రచారం జరుగుతున్న తరుణంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లడ్‌కుయ్‌ పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ‘‘నేను ప్రభుత్వాన్ని నడపడం లేదు. కుటుంబాన్ని నడుపుతున్నాను. మీరంతా నా కుటుంబం. నాలాంటి సోదరుడు మీకు దొరకడు. నేను వెళ్లిపోయాక మీరు నన్ను ఎంతగానో మిస్ అవుతారు’’ అని శివరాజ్ సింగ్ కామెంట్స్ చేశారు. తన జీవితంలో దేవుడిని పూజించడం తర్వాత అత్యంత పవిత్రమైన కార్యం రాజకీయాలే అని స్పష్టం చేశారు. ‘‘నా మాంసం, ఎముకలు మీకు (ప్రజలకు), మీ పిల్లలకు ఉపయోగకరంగా ఉంటేనే నా జీవితం ధన్యమైనట్టు’’ అని ఆయన చెప్పారు. ఇప్పటివరకు మధ్యప్రదేశ్ కు సంబంధించి బీజేపీ ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల లిస్టులో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు లేకపోవడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.


Similar News