హర్యానా ప్రజలంతా బీజేపీ వెంటే ఉన్నారు: జేపీ నడ్డా

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారీ విజయం సాధించిన బీజేపీ మూడో సారి ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకు సాగుతుంది.

Update: 2024-10-08 15:13 GMT

దిశ, వెబ్ డెస్క్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారీ విజయం సాధించిన బీజేపీ మూడో సారి ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకు సాగుతుంది. ఆ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా.. హాట్రిక్ విజయంతో.. బీజేపీలో జోష్ నెలకొంది. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాల అనంతరం ఢిల్లీ బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌లో విజయోత్సవ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు అమిత్‌ షా, జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్ తో పాటు.. పెద్ద ఎత్తున్న బీజేపీ కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా మాట్లాడుతూ.. ప్రధాని మోడీ నేతృత్వంలో హర్యానాలో ఘన విజయం సాధించాం. జమ్మూకాశ్మీర్‌లో గణనీయమైన ఓట్లు సాధించాం. హర్యానా ప్రజలంతా బీజేపీ వెంటే ఉన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ అబద్ధాలను ప్రచారం చేసింది. అయినప్పటికి హర్యానా ప్రజలు బీజేపీకి హ్యాట్రిక్‌ విజయాన్ని కట్టబెట్టారని కేంద్ర మంత్రి జేపీ నడ్డా చెప్పుకొచ్చారు.


Similar News