Lebanon pager blasts: లెబనాన్ పేజర్ పేలుళ్లతో.. కేరళవాసికి లింక్..?

ఇటీవల జరిగిన లెబనాన్ పేజర్ పేలుళ్ళ సంఘటన(Lebanon pager blasts) ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది.

Update: 2024-09-21 09:25 GMT

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల జరిగిన లెబనాన్ పేజర్ పేలుళ్ళ సంఘటన(Lebanon pager blasts) ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే ఈ పేలుళ్లకు సంబంధించిన ఘటనలో కేరళ(Kerala) రాష్ట్రానికి చెందిన వ్యక్తికి ప్రమేయం ఉందన్న వార్త ఇప్పుడు సంచలనం రేపుతోంది.అయితే ఈ పేజర్ పేలుళ్ల ఘటనతో కేరళకు చెందిన రిన్సన్ జోస్(Rinson Jose) అనే వ్యక్తిపై దర్యాప్తు జరుగుతోంది.

కేరళకు చెందిన రిన్సన్ కు నార్వేజియన్(Norway) పౌరసత్వం ఉన్నట్లు తెలుస్తుండగా.. అతను బల్గేరియన్ కంపెనీ నోర్టా గ్లోబల్ లిమిటెడ్ కు యజమాని అని సమాచారం. హెజ్బొల్లా జరిపిన దాడిలో వాడిన పేజర్లను సప్లై చేసిన కంపెనీ.. రిన్సన్ జోస్ కు చెందినది కావడంతోనే అతనిపై బల్గేరియా దర్యాప్తును ముమ్మరం చేసింది.

అయితే ఈ ఘటనపై.. కేరళలోని వయనాడ్ డిప్యూటీ ఎస్పీ పీఎల్ షిజు స్పందించారు. లెబనాన్ పేజర్ పేలుళ్లలో రిన్సన్ జోస్ హస్తం ఉందని వార్తలు వచ్చిన నేపథ్యంలో అతని గురించి పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ సంఘటనతో రిన్సన్ జోస్ సెప్టెంబర్ 17, 2024 నుంచి ఎవరికీ అందుబాటులో లేడని అతని సన్నిహతుల ద్వారా తెలుస్తోంది.కాగా లెబనాన్ లో జరిగిన పేజర్ పేలుళ్లలో 12 మంది మరణించగా.. సుమారు 3,000 మందికి పైగా గాయపడ్డారు.


Similar News