Waiter Dragged : బిల్లు కట్టమన్నాడని.. వెయిటర్ను ఏం చేశారో తెలుసా ?
దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో అమానుషం జరిగింది. ఫుడ్ బిల్లును చెల్లించమని అడిగినందుకు వెయిటర్తో ముగ్గురు కస్టమర్లు రాక్షసంగా ప్రవర్తించారు.
దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో అమానుషం జరిగింది. ఫుడ్ బిల్లును చెల్లించమని అడిగినందుకు వెయిటర్తో ముగ్గురు కస్టమర్లు రాక్షసంగా ప్రవర్తించారు. సదరు వెయిటర్ను తమ కారులోకి లాగి.. దాదాపు కిలోమీటరు దూరం ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. దీంతోపాటు ఆ ముగ్గురు కస్టమర్లు కలిసి వెయిటర్ పర్సులోని రూ.11,500 చోరీ చేశారు.
వెయిటర్ కళ్లకు గంతలు కట్టి ఓ రహస్య ప్రదేశానికి తరలించారు. ఆ ప్రదేశంలోనే ఒకరోజు రాత్రంతా వెయిటర్ను బంధించి ఉంచారు. మరుసటి రోజు ఉదయం ధరూర్ తాలూకాలో వెయిటర్ను వదిలేశారు.వెయిటర్ను కారులో ఈడ్చుకెళ్లడం హోటల్లోని సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడిన వారిలో ఒకరి పేరు సఖారాం జనార్దన్ ముండే అని గుర్తించారు.