జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఉగ్రదాడి

గురువారం ఉదయం జిల్లాలోని త్రాల్ ప్రాంతంలో జరిపిన కాల్పుల్లో ఒక కార్మికుడు గాయపడినట్లు తెలుస్తోంది. బటాగుండ్ గ్రామంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో బిజ్నోర్‌కు..

Update: 2024-10-24 05:10 GMT

దిశ, వెబ్ డెస్క్: జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పుల్వామాలోని స్థానికులపై కాల్పులకు తెగబడ్డారు. గురువారం ఉదయం జిల్లాలోని త్రాల్ ప్రాంతంలో జరిపిన కాల్పుల్లో ఒక కార్మికుడు గాయపడినట్లు తెలుస్తోంది. బటాగుండ్ గ్రామంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో బిజ్నోర్‌కు చెందిన శుభమ్ కుమార్ చేతికి తుపాకీ గాయమైందని అధికారులు తెలిపారు. ఆదివారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు కార్మికులు, ఒక వైద్యుడు మరణించిన ఘటన తీవ్రకలకలం రేపింది. నాలుగురోజుల్లోనే మరోసారి దాడికి పాల్పడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వారంరోజుల్లో ఉగ్రవాదులు మూడుసార్లు కాల్పులకు పాల్పడ్డారు. 


Similar News