Manipur Tension: మణిపూర్ లో ఉద్రిక్తతలు.. చురాచంద్ పూర్ లో నిషేధాజ్ఞలు

మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. చురాచంద్‌పూర్ జిల్లాలో 11 ఏళ్ల బాలికను కొందరు దుండగులు లైంగికంగా వేధించారు.

Update: 2024-10-24 06:28 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. చురాచంద్‌పూర్ జిల్లాలో 11 ఏళ్ల బాలికను కొందరు దుండగులు లైంగికంగా వేధించారు. దీంతో, అక్కడ ఉద్రిక్తతలను నెలకొన్నాయి. బుధవారం బంద్ కూడా నిర్వహించారు. పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉన్నందున ఆ ప్రాంతంలో నిషేధాజ్ఞలు విధించినట్లు అధికారులు తెలిపరు. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడంపై నిషేధం విధించారు. కుకీ-జోమి గ్రామ వాలంటీర్లు బంద్ కి పిలుపునివ్వడంతో మార్కెట్లు, దుకాణాలు, పాఠశాలలు మూతపడ్డాయి. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. ట్యూబాంగ్ మార్కెట్ వద్ద రోడ్డు మధ్యలో పాత టైర్లతో సహా వ్యర్థ పదార్థాల కుప్పను తగులబెట్టారు.

బాలికపై వేధింపులు

ఇకపోతే, లైంగిక వేధింపుల ఘటనపై బాలిక కుటుంబ సభ్యులు అక్టోబర్ 21న పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడైన దుకాణం యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలిక ఏవో వస్తువులు కొనుగోలు చేసేందుకు నిందితుని దుకాణానికి వెళ్లినప్పుడు వేధించినట్లు వెల్లడించారు. నిందితులు ఆ దుకాణ యజమాని ఇంట్లో ఆశ్రయం పొందారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు


Similar News