భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా పెమెరాలో ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, పోలీసులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.

Update: 2022-11-26 04:26 GMT

దిశ, చర్ల: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా పెమెరాలో ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, పోలీసులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. అనంతరం ఘటనా స్థలంలో పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో కీలక నేత ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పీఎల్‌జీఏ వారోత్సవాల కోసం మావోయిస్టుల సమావేశమైన నేపథ్యంలో పక్కా సమాచారంతో పోలీసులు దాడులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




Also Read......


మరోసారి కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు.

Tags:    

Similar News