Vivek Express: వివేక్ ఎక్స్ ప్రెస్ కు తృటిలో తప్పిన పెనుప్రమాదం

కాట్పడి సమీపంలో వివేక్ ఎక్స్ ప్రెస్ కు తృటిలో ప్రమాదం తప్పింది. ఇంజిన్ నుంచి బోగీలకు లింక్ తెగిపోవడంతో.. 2 గంటలపాటు రైలు నిలిచిపోయింది.

Update: 2024-10-25 06:39 GMT

దిశ, వెబ్ డెస్క్: అస్సాం (Assam) రాష్ట్రంలోని దిబ్రూగఢ్ నుంచి కన్యాకుమారి (Kanya Kumari)కి వెళ్తున్న వివేక్ ఎక్స్ ప్రెస్ (Vivek Express)కు తృటిలో పెనుప్రమాదం తప్పింది. తమిళనాడులోని వెల్లూరు సమీపంలోనున్న కాట్పడి (Katpadi) సమీపంలో 2 గంటలపాటు రైలు నిలిచిపోయింది. రైలు ఇంజిన్ నుంచి ఇతర కోచ్ లను కలిపే లింక్ రాడ్ విరిగిపోవడంతో.. ముకుందరాయపురం - తిరువాలం మధ్య రైలు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురై.. రైలు నుంచి దిగేశారు. ఇంజిన్ కు లింక్ ను అమర్చేంత వరకూ పట్టాలపైనే పడిగాపులు పడ్డారు. 2 గంటల తర్వాత రైలు ప్రారంభమవ్వడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. 

Tags:    

Similar News