అరుణాచల్ ప్రదేశ్‌లో ఘోర విషాదం.. లోయలో పడిన ట్రక్కు, ముగ్గురు ఆర్మీ జవాన్లు మృతి

అరుణాచల్ ప్రదేశ్‌లోని సుబంసిరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

Update: 2024-08-27 22:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: అరుణాచల్ ప్రదేశ్‌లోని సుబంసిరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం రోజు లోతైన లోయలో ట్రక్కు పడిపోవడంతో ముగ్గురు ఆర్మీ సిబ్బంది మరణించగా, నలుగురు గాయపడినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆర్మీ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. గాయపడిన నలుగురు సైనికులను హెలికాప్టర్ ద్వారా స్థానిక ఆస్పత్రికి తరలించారు.ఈ ప్రమాదంలో ముగ్గురు సైనికులు అక్కడికక్కడే మరణించగా, మరో నలుగురు గాయపడ్డారని ఇటానగర్‌లోని పోలీసు అధికారి తెలిపారు.చనిపోయిన వాళ్లలో హవల్దార్ నఖత్ సింగ్, నాయక్ ముఖేష్ కుమార్ , గ్రెనేడియర్ ఆశిష్‌ ఉన్నట్లుగా సమాచారం. కాగా ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని ఆర్మీ ఉన్నత అధికారి తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంభ సభ్యులకు భారత సైన్యం అండగా నిలుస్తుందని ఈస్టర్న్ కమాండ్ ఆర్మీ Xలో ఓ ప్రకటన విడుదల పేర్కొంది. 


Similar News