Suicide: భర్త ఐఏఎఫ్ ఆఫీసర్, భార్య ఆర్మీ కెప్టెన్.. ఒకే రోజు ఇద్దరి సూసైడ్

భారత సైన్యంలో పని చేస్తున్న దంపతులు ఒకే రోజు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నెల 15న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Update: 2024-10-17 12:20 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారత సైన్యంలో వేర్వేరు హోదాల్లో పని చేస్తున్న దంపతులు ఒకే రోజు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నెల 15న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన దీన్ దయాల్ దీప్ (32) ఆగ్రాలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో ఫ్లైట్ లెఫ్ట్ నెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే రాజస్థాన్‌కు చెందిన ఆయన భార్య రేణు తన్వర్ (28) ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిల్లో కెప్టెన్‌గా పని చేస్తున్నారు. 2022లో లవ్ మ్యారేజ్ చేసుకున్న వీరిద్దరూ ఆగ్రాలోని ఎయిర్‌ఫోర్స్‌ క్వాటర్స్‌లో నివసిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం తెల్లవారుజామున తన గదిలోకి వెళ్లిన దీన్ దయాల్ దీప్ ఎంతకీ బయటకు రాకపోవడంతో తన స్నేహితులు తలుపులు తీసి చూడగా ఆత్మహత్య చేసుకుని కనిపించాడు.

అలాగే అదే రోజు రాత్రి ఆయన భార్య రేణు ఢిల్లీలోని ఆర్మీ గెస్ట్ హౌస్‌లో ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. తన తల్లి కౌశల్య వైద్య చికిత్స నిమిత్తం సోదరుడు సుమిత్‌తో కలిసి అక్టోబర్ 14న గెస్ట్ హౌస్‌కు చేరుకున్న ఆమె తల్లి సోదరుడు ఆస్పత్రికి వెళ్లిన సమయంలో ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేణు బసచేసిన గదలో సూసైడ్ నోట్ గుర్తించారు. తన భర్త దీప్‌తో కలిసి అంత్యక్రియలు నిర్వహించాలని అందులో పేర్కొంది. అయితే వీరిద్దరూ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియలేదు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 


Similar News