Suicide : మెట్రో స్టేషన్ నుండి దూకి వ్యక్తి ఆత్మహత్య.. ఎక్కడంటే..?

ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీలో విషాద ఘటన చోటు చేసుకుంది.

Update: 2024-08-08 14:41 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీకి చెందిన 50 ఏళ్ల వ్యక్తి యమునా బ్యాంక్ మెట్రో స్టేషన్ నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా ఆ వ్యక్తి గాంధీ నగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. అనారోగ్య సమస్యలు, ఆర్ధిక కష్టాల వల్లనే వ్యక్తి ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు . కాగా మృతుడి దగ్గర సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

అయితే ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అతను సూసైడ్ చేసుకుంటున్న సమయంలో తన చుట్టూ చాలా మంది ఉన్న కూడా ఒక్కరూ కూడా అతన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. ఈ ఘటన కారణంగా ఢిల్లీ మెట్రో సేవలు 15 నిమిషాల పాటు నిలిచిపోయాయని మెట్రో అధికారులు తెలిపారు. 


Similar News