దేశంలోనే అతిపెద్ద కూరగాయల మార్కెట్‌‌కు రాహుల్‌.. వ్యాపారులతో మాటామంతి..

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజలతో మమేకం అయ్యేందుకు ఈ మధ్యకాలంలో ఆకస్మిక పర్యటనలు చేస్తున్నారు.

Update: 2023-08-01 11:00 GMT

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజలతో మమేకం అయ్యేందుకు ఈ మధ్యకాలంలో ఆకస్మిక పర్యటనలు చేస్తున్నారు. ఈక్రమంలోనే ఆయన మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు దేశంలోనే అతిపెద్ద కూరగాయల హోల్‌సేల్‌ మార్కెట్‌‌కు వెళ్లారు. ఢిల్లీలోని ఆజాద్‌పుర్‌ మండిలో షాపులు నడుపుకునే కూరగాయల వ్యాపారులు, పండ్ల వ్యాపారులు, స్థానికులతో రాహుల్‌ మాట్లాడారు. కూరగాయల ధరల గురించి వారిని ఆరా తీశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇటీవల కాలంలో డ్రైవర్లు, రైతులు, మెకానిక్‌లను కూడా రాహుల్ ఇలాగే సడెన్‌గా వెళ్లి కలిశారు. ఆప్యాయంగా మాట్లాడి వాళ్ళ బాధలు తెలుసుకున్నారు.


Similar News