Priyanka Gandhi : ప్రియాంకాగాంధీపై పోటీకి నవ్యా హరిదాస్

దిశ, నేషనల్ బ్యూరో : కేరళలోని వయనాడ్‌లో జరగనున్న లోక్‌సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకాగాంధీపై పోటీ చేసే బీజేపీ అభ్యర్థి ఎవరో తేలిపోయింది.

Update: 2024-10-19 15:44 GMT

దిశ, నేషనల్ బ్యూరో : కేరళలోని వయనాడ్‌లో జరగనున్న లోక్‌సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకాగాంధీపై పోటీ చేసే బీజేపీ అభ్యర్థి ఎవరో తేలిపోయింది. అక్కడి నుంచి నవ్యా హరిదాస్‌‌ను కమలదళం బరిలోకి దింపింది. ప్రస్తుతం బీజేపీ మహిళా మోర్చా కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆమె వ్యవహరిస్తున్నారు.

కోజికోడ్ మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో రెండుసార్లు కౌన్సిలర్‌గా ఎన్నికైన ట్రాక్ రికార్డు నవ్యకు ఉంది. కోజికోడ్ కార్పొరేషన్ పరిధిలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగానూ ఆమె వ్యవహరిస్తున్నారు. 2021లో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగగా.. దక్షిణ కోజికోడ్ స్థానం నుంచి ఎన్డీయే కూటమి అభ్యర్థిగా నవ్య పోటీ చేసి ఓడిపోయారు. నవంబరు 13న వయనాడ్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది.  


Similar News