Gauri Lankesh : ‘షిండే’ సేనలోకి గౌరీ లంకేశ్ హత్య కేసు నిందితుడు
దిశ, నేషనల్ బ్యూరో : బెంగళూరులో 2017లో జరిగిన జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న శ్రీకాంత్ పంగార్కర్ మళ్లీ రాజకీయాల్లోకి ప్రవేశించారు.
దిశ, నేషనల్ బ్యూరో : బెంగళూరులో 2017లో జరిగిన జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న శ్రీకాంత్ పంగార్కర్ మళ్లీ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆయన శివసేన(ఏక్నాథ్ షిండే) తీర్థం పుచ్చుకున్నారు. మహారాష్ట్రలోని జాల్నాలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమం వేదికగా షిండే సేన కండువాను పంగార్కర్ కప్పుకున్నారు. మాజీ మంత్రి అర్జున్ ఖోట్కర్ ఆయనను శివసేన(ఏక్నాథ్ షిండే)లోకి ఆహ్వానించారు.
గతంలో శ్రీకాంత్ పంగార్కర్ శివసేనలోనే ఉండేవారు. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ఆయన సొంతగూటికి చేరారు. జాల్నా అసెంబ్లీ ఎన్నికల ప్రచార సారథ్య బాధ్యతలను శ్రీకాంత్ పంగార్కర్కు శివసేన(ఏక్నాథ్ షిండే) అప్పగించింది. జాల్నా స్థానం నుంచి పోటీ చేయాలనే ఆసక్తితో శ్రీకాంత్ ఉన్నారని.. అయితే మహాయుతి కూటమిలో సీట్ల పంపకాలు జరిగిన తర్వాతే దీనిపై పూర్తి క్లారిటీ వస్తుందని అర్జున్ ఖోట్కర్ వెల్లడించారు.