కోలకతా మర్డర్ కేసులో కీలక పరిణామం

కోలకతా ట్రైనీ వైద్యురాలి హత్యాచార ఘటనా దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే.

Update: 2024-08-25 13:36 GMT

దిశ, వెబ్ డెస్క్ : కోలకతా ట్రైనీ వైద్యురాలి హత్యాచార ఘటనా దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ కి ఆదివారం మరోసారి లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించారు అధికారులు. ఈ కేసులో మరో ఇద్దరికి కూడా ఈరోజు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించినట్టు తెలిపారు. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో చేరుకున్న కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబొటరీ బృందం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వీరందరికీ కోలకతా జైళ్లోనే ఈ పరీక్ష నిర్వహించారు. అయితే లై డిటెక్టర్ పరీక్షలో నిందితులు వెల్లడించిన వివరాలు మాత్రం బయటకు రానివ్వలేదు. అలాగే ఆర్జీ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్, మరో నలుగురు డాక్టర్లకు, ఓ సివిల్ వాలంటీర్ కు శనివారం లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించారు. వాటి వివరాలు కూడా ఎక్కడా బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు సీబీఐ అధికారులు.  


Similar News