ప్రజాస్వామ్యం లేని చోటే ఇలా జరుగుతుంది..

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి జీ20 విందు ఆహ్వానం అందకపోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం మండిపడ్డారు.

Update: 2023-09-09 12:17 GMT

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి జీ20 విందు ఆహ్వానం అందకపోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం మండిపడ్డారు. ప్రజాస్వామ్యం, ప్రతిపక్షం లేని దేశాల్లో తప్ప ఇలా ఎక్కడా జరగదని విమర్శించారు. ఇంకా భారత్‌ ఇలాంటి దశకు చేరుకోలేదనే అనుకుంటున్నానని చిదంబరం అసహనం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు.

ఇదే అంశంపై స్పందించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ప్రతిపక్ష నేతలంటే ప్రధాని మోడీకి లెక్క లేదని కామెంట్ చేశారు. "నేను ఇప్పటికే ఈ వివాదంపై స్పందించాను. మా పార్టీ నేతలు కూడా మాట్లాడు తున్నారు. బీజేపీ మరీ ఇంత దిగజారిపోవడం సరికాదు. ఇలాంటి రాజకీయాలు అసలు సరికావు" అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.


Similar News